ఒక్కన్నే పంపుడ్రి..ఒక్క ముచ్చటే చెప్పుండ్రి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణపై ఈనెల 28న కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒక్కో ప్రతినిధినే పంపాలని టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. అఖిలపక్షంపై కేంద్రం ప్రకటన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై ఇకనైనా అన్నిపార్టీలు చిత్తశుద్ధితో నిర్ణయం ప్రకటించాలని కోరారు. ఇంతకాలం తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పుకొస్తున్న సీమాంధ్ర పార్టీల అసలు రంగు ఇప్పుడు బయట పడుతుందన్నారు.