ఒడిషాలో దారుణ ఘటన

 

9ఏళ్ల చిన్నారిపై దొంగల సామూహిక అత్యాచారం

భువనేశ్వర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఒడిషాలో దారుణం జరిగింది. ఓ తొమ్మదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం చేశారు. దొంగతనానికి వచ్చి దొరికిన సొత్తు ఎత్తుకు వెళ్లారు. అదే సమయంలో అమ్మ పక్కన ఆదమరిచి నిద్రపోతున్న తొమ్మిదేళ్ల బాలికను అపహరించి దూరంగా తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒడిశాలోని గంజాం జిల్లా దొయికాన గ్రామంలో ఈ దారుణం వెలుగు చూసింది. ఇంట్లో అమ్మ పక్కన ఆదమరచి నిదురిస్తున్న తొమ్మిదేళ్ల బాలికను అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు. దొరికిన సొత్తంతా ఎత్తుకుపోవటంతో పాటు బాలిక పైనా పైశాచిత్వాన్ని ప్రదర్శించారు. ఈ దారుణం ఒడిశాలోని గంజాం జిల్లా కవిసూర్యనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధి దొయికొన గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. సంఘటన సమయంలో బాధిత బాలిక కుటుంబ సభ్యులంతా ఒకేచోట పడుకుని ఉన్నారు. గురువారం వేకువజామున మేల్కొన్న బాలిక తల్లి.. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనతో భర్తను నిద్ర లేపింది. అప్పటికే ఇంట్లోని సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. అల్మారాలో దాచిన రూ.20వేల నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు దంపతులు గుర్తించారు. దొంగతనానికి వచ్చినవారే తమ కుమార్తెనూ ఎత్తుకుపోయి ఉంటారని అనుమానించి, ఇరుగుపొరుగు సాయంతో బాలిక కోసం గాలిస్తుండగా బాధితురాలు ఏడుస్తూ వచ్చింది. ముసుగులు ధరించిన ముగ్గురు యువకులు తనను ఎత్తుకుని గడ్డివాము చాటుకు తీసుకెళ్తుండగా, మెలకువ వచ్చిందని పేర్కొంది. అరిస్తే చంపేస్తామని బెదిరించి దుండగులు అత్యాచారం చేశారని బాధితురాలు పేర్కొన్నట్టు తండ్రి తెలిపారు.తీసుకువెళ్లి బెదిరించి అత్యాచారం చేశారు అని తన కుమార్తె చెబుతోందని బాధితురాలి తండ్రి వాపోయారు. దీనిపై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.