ఓపెన్ ఎస్ ఎస్ సి ఇంటర్ లో ప్రవేశాలు

గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (05): తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) సార్వత్రిక విద్య ద్వారా ప్రవేశాలు పొందే విద్యార్థులకు అపరాధ రుసుముతో నవంబర్ 10వ తేదీని చివరి తేదీ గా ప్రకటించడం జరిగిందని గోపాల్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమాకాంత్, ఓపెన్ స్కూల్ పాఠశాల ఇన్చార్జి బోరోజ్ యాదగిరి లు తెలియజేశారు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎంపీసీ, బైపీసీ,సీఈసీ, కోర్సులలో ప్రవేశాలు పొందేందుకు ఇది చివరి అవకాశం అని నేరుగా పాఠశాలలో గాని లేదా 99512 60435 గల నెంబర్ ను సంప్రదించగలరని వారు తెలిపారు