ఓల్డ్ బోయిన్ పల్లి లో జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాదయాత్ర

సికింద్రాబాద్ నవంబర్ 23 ( జనం సాక్షి ) కూకట్ పల్లి నియోజకవర్గం బోయిన్ పల్లి డివిజన్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి,జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ భారీ జన సందోహంమధ్య,కార్యకర్తల నినాదాలు నడుమ ప్రచారం కొనసాగింది.ఓల్డ్ బోయిన్ పల్లి, అంజయ్య నగర్,హస్మత్ పేట్ విలేజ్,హరిజన బస్తీ,వరకు ఎన్నికల ప్రచారం కొనసాగించారు.ఆనంతరం అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పరిపాలన కొనసాగుతుందని అన్నారు.రాజకీయాల్లోకి సామాన్యులు రాకుండా అడ్డుపడటం, భయపెట్టడo మంచి పద్ధతికాదని, ఇలాంటి ధోరణి మారానంతవరకు ప్రజలలో ఉద్యమాలుపుట్టుకొస్తాయని చెప్పారు. ఇలాంటి అహంకారపు పరిపాలన సాగిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.30వ తేదీ జరగబోయే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాను.ఈ కార్యక్రమంలో మాధవరం కాంతారావు,ఎ.సూర్య రావు,శ్రీకర్ రావు,పప్పు పటేల్,సంతోష్ గౌడ్, లక్ష్మీ యాదవ్,నిశంకర్రావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,జిల్లా కార్యవర్గ సభ్యులు,డివిజన్ నాయకులు,మహిళా నాయకులు,జనసేన నాయకులు,వీరమహిళలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు