కజిరంగా పార్క్లో విలియం దంపతుల సందడి
బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ విలియం దంపతులు అస్సోంలోని కజిరంగా జాతీయ పార్క్ ను సందర్శించారు. ప్రిన్స్ దంపతులు కోసం పార్క్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓపెన్ టాప్ జీప్ లో పార్క్ లోని జంతువులను ప్రిన్స్ దంపతులు వీక్షించారు. ఆ తర్వాత కాసేపు పార్క్ అధికారులతో సమావేశమయ్యారు. కజరంగా పార్క్ అందాలు అద్భుతంగా ఉన్నాయని ప్రిన్స్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.