కజిరంగా పార్క్‌లో విలియం దంపతుల సందడి

1

బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియం దంపతులు అస్సోంలోని కజిరంగా జాతీయ పార్క్‌ ను సందర్శించారు. ప్రిన్స్ దంపతులు కోసం పార్క్‌ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓపెన్‌ టాప్‌ జీప్‌ లో పార్క్‌ లోని జంతువులను ప్రిన్స్ దంపతులు వీక్షించారు. ఆ తర్వాత కాసేపు పార్క్ అధికారులతో సమావేశమయ్యారు. కజరంగా పార్క్‌ అందాలు అద్భుతంగా ఉన్నాయని ప్రిన్స్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.