కదులుతున్న కారులో మహిళపై అత్యాచారం

హైదరాబాద్‌: కదులుతున్న కారులో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన ఘటన దిల్లీలోని నోయిడాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్‌యూవీ కారులో వెళ్తున్న 30ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు తుపాకి గురిపెట్టి బెదిరించారు. అనంతరం మత్తుమందు కలిపిన పానీయాన్ని ఆమెకు బలవంతంగా తాగించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు ఆమెకు తెలిసిన వాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.