కనకదుర్గమ్మను దర్శించుకున్న కొప్పుల

విజయవాడ,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  తెలుగు రాష్టాల్రు మధ్య సత్సంబంధాలు కొనసాగి.. రెండు రాష్టాల్రు అభివృద్ధి పథంలో నడవాలని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను ఆయన కుటుంబసమేతంగా ఈ ఉదయం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అమ్మవారికి ముక్కపుడకను సమర్పించారు. అనంతరం ఈవో సురేష్‌ బాబు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందించారు.