కన్నవారికి కడుపు కోత మిగిల్చిన ఈత సరదా
దంతాలపల్లి సెప్టెంబర్ 18 జనం సాక్షి
సరదాగా ఈతకు వెళ్లి ఓ యువకుడు మృత్యువాత పడడంతో కన్నవారికి కడుపుకోత మిగిల్చిన సంఘటన మండలంలోని పెద్ద ముప్పారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై కూచిపూడి జగదీష్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన మార్త సురేష్ రజితల ఏకైక కుమారుడు మార్త ప్రచండ (18) శనివారం మధ్యాహ్నం గ్రామ శివారు పాలేరు వాగులో చెక్ డ్యామ్ లో తన స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో గల్లంతైనట్లు స్నేహితులు,మృతుని తల్లిదండ్రులకు తెలపడంతో వాగులో వెతకగా ఆదివారం ఉదయం మృతదేహం లభ్యమైనట్టు తెలిపారు. కాగా మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.