కన్హయ కుమార్‌ విడుదల

4A

– ఢిల్లీ సర్కారు క్లీన్‌చిట్‌

– జేఎన్‌యూలో సంబరాలు

న్యూఢిల్లీ,మార్చి3(జనంసాక్షి): రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ ఢిల్లీలోని తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా జేఎన్‌యూకు వెళ్లాడు. వర్సిటీకి చేరుకున్న విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్యకు తోటి వర్సిటీ విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. కొద్దిసేపు అక్కడ సందడి

వాతావరణం నెలకొంది. ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కన్హయ్యకు ఊరట కల్పిస్తూ జస్టిస్‌ ప్రతిభారాణితో కూడిన ధర్మాసనం ఆరు నెలల కాలానికి బెయిల్‌ మంజూరు చేసింది. ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, కేసు దర్యాప్తునకు సహకరించాలని కోర్టు నిర్దేశించింది. అవసరమైనపుడు అధికారుల ఎదుట ఆయన హాజరుకావాలని, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. విడుదల కోసం  రూ. 10 వేల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలంది. తాను భారత్‌కు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలూ చేయలేదంటూ కన్హయ్య బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా హైకోర్టు మంజూరు చేసింది. ఆరు నెలల బెయిల్‌ మంజూరు కావడంతో కొన్ని షరతులతో విడుదలయ్యాడు. అంతకు ముందు జేఎన్‌యూలో నిర్వహించిన ర్యాలీల్లో కన్నయ్య ఎటువంటి దేశ వ్యతిరేక నినాదాలు చేయలేదని ఢిల్లీ సర్కార్‌ చేపట్టిన న్యాయవిచారణ నివేదికలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కన్నయ్యకు క్లీన్‌చీట్‌ను జారీచేసింది. ఫిబ్రవరి9న జరిగిన ఘటనపై బుధవారం రాత్రి నివేదిక అందచేశామని ఢిల్లీ డిస్టిక్ట్ర్‌ మేజిస్టేట్ర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. ఊమర్‌ ఖలీద్‌, మరో విద్యార్థి ఆ రోజు నినాదాలు చేశారా లేదా అన్నదానిపై పూర్తిస్థాయి జరగాల్సి ఉందని పేర్కొన్నారు. లభ్యమైన చాలా వీడియోలలో ఊమర్‌ ఖలీద్‌ కనపించాడనీ, కశ్మీర్‌ అంశంపై, అఫ్జల్‌ గురు విషయాలలో అతడు మద్ధతిస్తున్నట్లు కనిపించాడని సంజయ్‌ కుమార్‌ వెల్లడించారు. మరిన్ని వివరాలతో పాటు ఊమర్‌ ఖలీద్‌ జాతి వ్యతిరేఖ వివాదాల కార్యక్రమాలలో పాల్గొన్నాడా, లేదా అన్నది త్వరలో తెలుతుందన్నారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కొందరు విద్యార్థులను జేఎన్‌ యూ వర్సిటీ యాజమాన్యం గుర్తించిందని, పూర్తిస్థాయి దర్యాప్తులో అన్ని విషయాలు బయటికొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. తాను భారత్‌కు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలూ చేయలేదంటూ కన్హయ్య బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా హైకోర్టు మంజూరు చేసింది. మిగతా ఇద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 12న కన్హయ్య అరెస్టయిన విషయం విదితమే.