కమ్యూనిటీ హాలుకు ఎంపి శంకుస్థాపన

మేడ్చల్‌,జూలై10(జ‌నం సాక్షి ): జిల్లాలోని మల్లంపేట గ్రామంలో మల్కాజ్‌గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి ఇవాళ పర్యటించారు. గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి, సీసీ రోడ్ల పనులకు మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, సర్పంచ్‌, ఎంపీపీలతో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.