కమ్యూనిస్టు యోధునికి కన్నీటి నివాళి

కారకస్‌, (జనంసాక్షి) :
కమ్యూనిస్టు యోధుడు, వెనిజుల అధ్యక్షుడు హ్యూగో చావేజ్‌కు ప్రపంచం కన్నీటి నివాళి అర్పించింది. క్యాన్సర్‌తో రెండేళ్లుగా పోరాడి బుధవారం తుదిశ్వాస విడిచిన చావేజ్‌కు వెనిజులాతో పాటు లాటిన్‌ అమెరికా దేశాల నుంచి తరలివచ్చిన అశేష జనవాహిని కన్నీటి నివాళి అర్పించింది. కారకస్‌లోని మిలటరీ అకాడమీలో ఉంచిన ఆయన భౌతిక ఖాయాన్ని సందేర్షించేందుకు ప్రజలు బారులు తీరారు. వెళ్లిపోయావా ధీరుడా అంటూ బోరున రోదించారు. తుది సారిగా ఆయనకు నివాళి అర్పించేందుకు తరలివచ్చిన జనంతో కరాకస్‌ జనసంద్రాన్ని తలపించింది. యోధుడి వీడ్కోలిదే అంటూ వివిధ దేశాల ప్రతినిధులు అంజలి ఘటించారు.