కరెంట్‌ స్తంభాన్ని ఢీకొన్న స్కూలు బస్సు

విద్యార్థులకు తప్పిన ముప్పు
విశాఖపట్టణం,జూలై22(జ‌నంసాక్షి):  సింహాచలంలో స్కూల్‌ బస్సు బీభత్సం సృష్టించింది. స్కూల్‌ బస్సు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. కరెంటు స్తంభం విరిగి బస్సుపై విద్యుత్‌ తీగలు పడ్డాయి. ఘటన అనంతరం స్కూల్‌ బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు. స్థానికులు అప్రమత్తమై విద్యార్థులను బస్సులోంచి బయటకు తీశారు. స్కూల్‌ యాజమాన్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు విషయం తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టారు.