కర్ణాటకలో మరోసారి భాజపా నేతల సమావేశం

బెంగళూరు : ఈ సారి ఉదయం జరగాల్సిన భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం సమావేశం రద్దు కావడంతో భాజపా నేతలు ఈ రోజు సాయంత్రం మరోసారి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అధికారాన్ని గౌడ్‌ నుంచి శెట్టర్‌కు బదలాయించే ప్రక్రియలో గౌడ్‌ మద్దతుదారులు ఎదురుతిరిగారు. వారిలో 50 మంది ఉదయం సమావేశానికి హాజరు కాలేదు. దాంతో రాష్ట్రంలో నాయకత్వ సంక్షోభం కొనసాగుతోంది.