కర్ణాటకలో మరో గ్యాంగ్ రేప్.. కామాంధుల పైశాచికం
కర్నాటకలో మరో సామూహిక అత్యాచారం వెలుగు చూసింది. మంగళవారం రాత్రి తుమకూరు-బెంగళూరు జాతీయ రహదారిపై తిరుగుతున్న వాహనంలో ఓ యువతి(22) పై ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. నిజగల్ సమీపంలో జాతీయ రహదారిపై రక్తపు మడుగులో పడివున్న ఈ యువతిని గురించి పోలీసులకు స్థానికులు సమాచారం అందించగా ఆమెను దాబ్సపేట ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బాధితురాలు కోలుకుంటుంది. యువతి మాగడి తాలూకాకు చెందినదిగా గుర్తించారు. బెంగళూరులోని దాసరహళ్లి గార్మెంట్లో పనిచేస్తున్న యువతి మంగళవారం రాత్రి విధులు ముగించుకుని బస్సు కోసం ఎదురు చూస్తుండగా టాటా సుమో వాహనంలో వచ్చిన వ్యక్తి తుమకూరు టౌన్హాల్ వద్ద డ్రాప్ చేస్తానని నమ్మించి ఎక్కించుకున్నారు. దారిలో మరో ఐదుగురు ఇదే వాహనంలో ఎక్కారు. వారంతా తనను కత్తులతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది.