కర్నాటకలో మరో కాంగ్రెస్‌ నేత ఇంటిపై ఐటి దాడులు

బెంగుళేరు,ఆగస్ట్‌30 : ఆదాయ పన్ను ఎగవేతకు సంబంధించిన కేసులో కర్నాటక మంత్రి డీకే శివకుమార్‌ నివాసంపై ఐటీ శాఖ ఇటీవల దాడులు నిర్వహించి భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అలాగే డబ్బును కూడా పట్టుకుంది. ఈ కేసులో తాజాగా కాంగ్రెస్‌ నేత విజయ్‌ మల్‌గుండ్‌ ఇంటిపై ఐటీ దాడులు చేపట్టింది. బెంగళూరులోని విజయ్‌ నివాసంతోపాటు చెన్నై, ఢిల్లీలోని పలు నివాసాలపై ఐటీ దాడులు నిర్వహించింది. ఇప్పటికే ఐటీ శాఖ ఢిల్లీ, కర్నాటకలోని 64 ప్రాంతాల్లో మంత్రి డీకే శివకుమార్‌ బంధువుల ఇండ్లలోనే సోదాలు జరిపి 11 కోట్ల నగదుతోపాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.