కర్షకుల రక్తం కళ్లజూసింది మీరు..

రైతు హంతక రాజ్యం మీది..!!
` అప్పులు మాఫీ చేసిన జైకిసాన్‌ ప్రభుత్వం మాది
` రుణమాఫీ జరగలేదని అనడం ఓ పెద్ద జోక్‌
` ‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం..
` జాతీయ స్థాయిలో అధికార మార్పు దేశప్రజల కోరిక
` కారు స్టీరింగ్‌ కేసీఆర్‌ చేతుల్లోనే.. ‘కమలం’ స్టీరింగ్‌ అదానీ చేతుల్లోకి..
` గుజరాత్‌ బుద్ధి మాకు నేర్పకుండా వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి
` ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌
హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి (జనంసాక్షి):‘‘అన్నదాత అప్పులు మాఫీ చేసిన జైకిసాన్‌ ప్రభుత్వం మాది. కార్పొరేట్‌ దోస్తులకు 14.5 లక్షల కోట్ల రుణాలు రద్దు చేసిన నై కిసాన్‌ సర్కారు మీది. కర్షకుల రక్తం కండ్ల జూసిన రైతుహంతక రాజ్యం బీజేపీది. పదేళ్లపాటు విభజన హామీలను పాతరేసి.. ఎన్నికల హామీలను గాలికి వదిలేసి ఓట్ల వేటలో ఇప్పుడొచ్చి మాట్లాడితే నమ్మేదేవరు’ అని మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. మార్పును కోరుకుంటుందని తెలంగాణ ప్రజలు కాదని, జాతీయ స్థాయిలో అధికార మార్పులు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీచేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ ఘాటుగానే స్పందించారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమని తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ స్టీరింగ్‌ కేసీఆర్‌ చేతుల్లో పదిలంగానే ఉందని, కానీ బీజేపీ స్టీరింగ్‌ అదాని చేతిలోకి వెళ్లిపోయిందంటూ సెటైర్లు వేశారు. కేంద్రం కిసాన్‌ సమ్మాన్‌ కింద ఇచ్చింది కేవలం నామమాత్రం కానీ.. ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ 70 లక్షల మంది రైతులకు 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన విషయం తెలుసుకుంటే మంచిది మోదీకి సూచించారు. రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం మిలియన్‌ డాలర్‌ జోక్‌ అన్నారు. ప్రాజెక్టులతో చుక్క నీరు రాలేదనడం మోడీ అవివేకానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో సాగుతోంది సాగునీటి విప్లవం సాగుతుందని, తెలంగాణ రైతు పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన మీరా మాట్లాడేది? అంటూ నిలదీశారు. తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యాన్ని కొనమంటే నూకలు తినమన్న కేంద్ర పెద్దల అవమానకర మాటలు తెలంగాణ రైతులు మరిచిపోలేదన్నారు. మీరు ఎన్ని చెప్పినా.. బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయన్నారు.