కలాం కు నివాళులర్పించిన ప్రధాని

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 84వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని డీఆర్డీవో భవన్ లో ఘనంగా నివాళులర్పించనున్నారు. ప్రధాని నరేంద్రమోడీతోపాటు పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. మాజీ రాష్ట్రపతి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. కలాం జీవిత విశేషాలను తెలిపే ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. అటు హైదరాబాద్ లోని డీఆర్డీవోకు అబ్దుల్ కలాం పేరు ను కేంద్రం ప్రకటించనుంది. మిస్సైల్ మ్యాన్ కలాం 1982 నుంచి రెండు దశాబ్దాలపాటు హైదరాబాద్ డీఆర్డీవోలో పనిచేశారు.