కల్తీ పాలు తాగి వంద మంది చిన్నారులకు అస్వస్థత

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: మధ్యాహ్న భోజనంలో భాగంగా కల్తీ పాలు తాగి 100 మంది విద్యార్థులు అస్వస్థత పాలైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆగ్రాలోని ఓ వసతి గృహంలో జరిగిన ఈ ఘటనలో ఒక్క ఆగ్రా ఆస్పత్రిలోనే దాదాపు పాతిక మంది చిన్నారులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.