కశ్వవ్‌ 14, సింధు 19

న్యూఢిల్లీ : టాప్‌ టెన్‌కి మరో నాలుగు ర్యాంకుల దూరంలో ఉన్నాడు భారత్‌కి చెందిన యువ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పారుపల్లి కశ్యవ్‌, బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ ఈరోజు విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ పద్నాలుగో ర్యాంకులో నిలిచాడు. కశ్వవ్‌ ఇటీవలే  మోడీ ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ టోర్నీల్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇదే టోర్నమొంటులో మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌లో ఓడిపోయిన పీవీ సింధూ కూడా కెరీర్‌ బెస్ట్‌ 19వ ర్యాంకు సాధించింది.