కస్టడీలో ఉన్న నిందితులపై పోలీసుల లాఠీ

తూళ్లూరు పోలీసుల తీరుపై మండిపడ్డ జడ్జి
గుంటూరు,డిసెంబర్‌24(జనం సాక్షి): తుళ్ళూరు పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్ళూరు సీఐ దుర్గా ప్రసాద్‌తో పాటు పలువురు పోలీసులపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. గత రాత్రి 8 మంది ముస్లింలను ఓ కేసులో జడ్జి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. ఈ క్రమంలో పోలీసులు తమను చిత్రహింసలు పెట్టారని నిందితులు జడ్జి ఎదుట చెప్పారు. దీంతో నిందితులను జడ్జి గత రాత్రి జీజీహెచ్‌లో వైద్య పరీక్షలకు పంపారు. నిందితుల శరీరంపై గాయాలు ఉన్నట్లు జీజీహెచ్‌ వైద్యులు నివేదిక ఇచ్చారు. వెంటనే 8 మంది నిందితులకు రిమాండ్‌ రద్దు చేసిన జడ్జి… వారి విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. స్టేషన్‌లో నిందితులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి జడ్జి ఆదేశాలు జారీ చేశారు.