కాంగ్రెసులో చేరిన రంగసాయిపేట గౌడ కులస్తులు

వరంగల్ ఈస్ట్, నవంబర్ 24 (జనం సాక్షి)

వరంగల్ నగరంలోని 42వ డివిజన్ రంగసాయిపేటకు చెందిన గౌడ కులస్తులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిని కొండా సురేఖను భారీ మెజారిటీతో గెలిచేందుకు తమ వంతు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన గౌడ కులస్తులకు కిల వరంగల్ పిఎసిఎస్ చైర్మన్ కేడల జనార్ధన్, దామర కొండ కరుణాకర్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు వలుపదాసు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇదే 42వ డివిజన్ నుండి 17 బ్లాక్ నుండి సుమారు 40 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పర్వేస్ జావిద్ సోను చోటు మక్బూల్ కరిమా నజీమా రజియా సుల్తానా అమీనా తబస్సుము తదితరు పాలు కొన్నారు.