కాంగ్రెస్‌‌ పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి

దిల్లీ: తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన దిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్‌ నేతలతో సమావేశమయ్యేందుకే రేవంత్‌రెడ్డి దేశ రాజధాని వెళ్లినట్లు వూహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాను కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ వదంతులేనని ఆయన స్పష్టం చేశారు.