కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వదు : రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఉద్యమానికి మద్దతు ఎప్పూడు ఉంటుందని ఆయన చెప్పారు. జంతర్‌ మంతర్‌ వద్ద తెలంగాణ జేఏసీ ఆందోళనకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ఎన్డీఏ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రకటిస్తామని ఆయన హామినిచ్చారు. టీజేఏసీ నేతలతో భేటీ తర్వాత రాజ్‌నాధ్‌ సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.