కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కులేదు: చంద్రబాబు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 19,500 మంది రైతులు అత్మహత్యలు చేసుకున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాతే అంతా నష్టమేనని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో బీసీ వర్గాలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు, అభ్యున్నతికి పార్టీ పరంగా చేపటాల్సిన కార్యక్రమాలు ఈ రోజు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ తెలుగు దేశం పార్టీ విస్తృతసాయి సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలిపారు. తెలంగాణ, జగన్‌ విషయాల్లో కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు, ఆ ప్రభావం పార్టీపై పడిందని చంద్రబాబు అభిప్రాయపడ్డాడు. కాంగ్రెస్‌ చేతగాని ప్రభుత్వంగా అభివర్ణించిన ఆయన మెడికల్‌ సీట్లను కూడా వివాదం చేశారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులకు న్యాయసహయం అందించడం దారుణమాన్నారు.