కాంగ్రెస్ గెలుపు కోసం నాయకుల ప్రచారం.

బెల్లంపల్లి, నవంబర్ 23, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం కోణంపేట గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నాయకులు ప్రచారం ప్రారంభించారు. బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ ను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా గడపగడపకు ప్రచారం చేస్తున్నట్టు గొల్లపల్లి ఎంపీటీసీ బొమ్మెన హరీష్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజల బతుకుల్లో మార్పులు వస్తాయని ఆయన అన్నారు. అభయ హస్తం, మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి వివరిస్తూ ఈసారి బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ నీ గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు సునార్కరి సంతోష్, తోడే బాపురెడ్డి, కొండగొర్ల చంద్రయ్య, బీరం సంపత్ రెడ్డి, దుగుట బిక్కయ్య, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.