కాంగ్రెస్ నాయకుని జన్మదిన వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-యాచారం  మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో , ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇంచార్జి మాజీ శాసన సభ్యులు , మల్  రెడ్డి  రంగారెడ్డి  సమక్షం లో  పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకున్నా యాచారం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వరికుప్పల .సుధాకర్
మునుగోడు నియోజికవర్గ ఉప ఎన్నికలల లో భాగంగా  యాచారం మీదుగా మర్రిగూడ వెళ్తుండగా , యాచారం లో పార్టీ ఆఫీస్ లో సుధాకర్ జన్మదిన వేడుకకు హాజరు అయ్యి కేకు తినిపించి సుధాకర్ కి పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా  మల్ రెడ్డి రంగారెడ్డి మునుగోడు ఉపఎన్నికను ఉద్దేశించి మాట్లాడుతూ బీ.జే.పీ  పార్టీ  అదేవిధంగా కొత్తగా ఏర్పడిన
బిఆర్ ఎస్ పార్టీలను మునుగోడు ప్రజలు నమ్మరని , ఈ రెండు పార్టీలు  అధికారం  లో  ఉంటూ పేద , మధ్యతరగతి  ప్రజలనూ మోసం చేస్తున్నాయని , మునుగోడు ప్రజలు చాల ఉద్యమ పోరాట పటిమ కలిగిన వ్యక్తులు అని , చాల చైతన్య వంతులు మునుగోడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అబ్యర్థి అయినటువంటి పాల్వాయి స్రవంతి  ని తప్పకుండ  గెలిపిస్తారని , మునుగోడు ఉపఎన్నిక విజయము తో కాంగ్రెస్ పార్టీ విజయ డంఖా మోగిస్తుందని , వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రము లో దేశం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయమని చెప్పారు .అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తోనే న్యాయం జరుగుతుంది అని హితవు పలికారు .
ఈ కార్యక్రమం లో  యాచారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మస్కు .నరసింహ్మ , జిల్లా .ఉపాధ్యక్షుడు గులాం అక్బర్ , జిల్లా కార్యదర్శి  ఉప్పల.భాస్కర్ , ఎస్సి సెల్ మండల ప్రెసిడెంట్ చినోళ్ళ మల్లేష్ , కొత్తపల్లి రాణి భాయ్ , మండల యూత్ ప్రెసిడెంట్ గౌరారం .వెంకట్ రెడ్డి , నియోజకవర్గ లీగల్ సెల్ చైర్మనర్  ఆర్ .వెంకటేష్ యాదవ్ ,   నాయకులూ ముచ్చర్ల సింపత్ , చీర శేఖర్ , కె .జంగారెడ్డి, బోడ . మధు, విక్రమ్ ,వేణుగోపాల్ రెడ్డి ,దండే మల్లేష్ , అఖిల్ ఖాన్,తదితరులు పాల్గొన్నారు