కాంగ్రెస్ బిజెపి మోసపూరిత దొంగ హామీలను తిప్పి కొడతాం.

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం.
బిఆర్ ఎస్ యువ నేత కె రాంజీ రాథోడ్ .
తాండూరు అక్టోబర్ 13 (జనం సాక్షి)కాంగ్రెస్ బిజెపి మోసపూరిత హామీలను తిప్పికొడతా మని బిఆర్ఎస్ పార్టీ యువనేత కే రాంజీ రాథోడ్ పేర్కొన్నారు.బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్చేమ పథకాలనుమరియు రోహిత్ రెడ్డి గెలుపు ఆవశ్యకతను ప్రజలకువివరిస్తామని గిరిజన తండాల్లో ఎన్నికల ప్రచార బాధ్యతను తాను నిర్వహిస్తానని బిఆర్ ఎస్ యువ నాయకులు కె రాంజీ రాథోడ్ తెలిపార.బిఆర్ ఎస్ తాండూర్ నియోజక వర్గం యువజన విభాగం ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలోని ఏ ఆర్ గార్డెన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఆర్ ఎస్ యువ నేత కె రాంజీ రాథోడ్ మట్లాడుతూ గిరిజన గ్రామ పంచాయతీల ఏర్పాటు ,గిరిజనులకు 10శాతం రిజర్వేషన్, ప్రతీ నియోజక వర్గంలో బంజారా భవన్ ఏర్పాటు చేసి గిరిజనుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఘనత కెసిఆర్ కు దక్కుతుందన్నారు. కాంగ్రెస్ బిజెపి దొంగ హామీలను మోసపూరిత విధానాలను తిప్పి కొడతామని అన్నారు, తాండూర్ లో రోహిత్ రెడ్డి నీ గెలిపించి కెసిఆర్ కు బహుమతిగా ఇస్తామని వెల్లడించారు యువత అధైర్య పడవద్దని గెలిచేది బిఆర్ ఎస్ పార్టీ అని హ్యాట్రిక్ విజయం ఖాయంమని ఆశాభావం వ్యక్తంచేశారు బిఆర్ ఎస్ పతకాలను గడప గడపకు చెరవేయలని యువతకు పిలుపు నిచ్చారు.