కాంగ్రెస్ లో చేరికలు.

బెల్లంపల్లి, నవంబర్ 23, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలం కత్తెర్ల గ్రామానికి చెందిన 60 మంది యువకులు గురువారం టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ నాయకత్వాన్ని బలపరుస్తూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్వామి తెలిపారు. ఈఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని వారు తెలిపారు.