కాంగ్రెస్ లో చేరిన 100 మంది యువకులు.

రాయికల్,అక్టోబర్ 07 (జనంసాక్షి) మండలంలోని చింతలూరు,ఆలూరు,బషీర్ పల్లె గ్రామాలకు చెందిన సుమారు 100 మంది యువకులు జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి పార్టీలో చేరిన యువకులను ఆయన అభినందించారు.