కాంగ్రెస్ వెన్నులో వణుకు మొదలైంది

gwe23lr8తమ ప్రభుత్వం నల్ల ధనం నిరోధక చట్టాన్ని తీసుకొస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు ప్రారంభమైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్డీయే సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలతో కాంగ్రెస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతోందని, అందుకే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వారు అడ్డుపడుతున్నారన్నారు. భోపాల్ లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని బీజేపీని ఎద్దేవా చేసేవారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ 440 సీట్ల నుంచి 40కి పడిపోయిందని మోడీ గుర్తు చేశారు.