కామవాంఛకోసం బాలుడిని చంపేశాడు

డ్రైవర్‌ అరెస్ట్‌తో వెలుగు చూసిన హత్యోదంతం

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): రియాన్‌ ఇంటర్నేషన్‌లో శుక్రవారం జరిగిన విద్యార్థి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోగా ఛేదించారు. స్కూల్‌ బస్‌ కండక్టరే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేల్చారు. పోలీసుల కస్టడీలో నిందితుడు చెబుతున్న విషయాలు, హత్య జరిగిన వైనం ఒళ్లు గగుర్పొడిచేలా

ఉన్నాయి. తనతో సెక్స్‌ చేసేందుకు నిరాకరించడం వల్లే బాలుడిని హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు తెలిపాడు. నిందితుడు అశోక్‌ కుమార్‌ (42) గుర్గావ్‌లోని రియాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఎనిమిదేళ్ల నుంచి బస్‌ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. అదే స్కూల్‌లో బాధిత బాలుడు (7) రెండో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం బాలుడు వాష్‌ రూమ్‌కి వెళ్లగా… అక్కడే ఉన్న అశోక్‌ కుమార్‌ ఒంటరిగా ఉన్న బాడుడిని లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడు. విద్యార్థి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించడంతో అశోక్‌ అతడిని టాయిలెట్‌లోకి లాక్కెళ్లాడు. తనతోపాటు తెచ్చుకున్న చాకుతో రెండు సార్లు బాలుడి గొంతు కోసి హత్యచేశాడు. చాకును కడిగి ఘటనాస్థలి పక్కనే విసిరేశాడు. ఏవిూ ఎరగనట్టుగా బయటికి వచ్చేశాడు. విద్యార్థి శవం వాష్‌రూమ్‌ ఉన్నట్టు యాజమాన్యం గుర్తించగానే.. బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సహకరించింది కూడా అతడే కావడం గమనార్హం. కాగా హత్య జరిగిన సమయంలో అశోక్‌ కుమార్‌ వాష్‌రూమ్‌లోకి వెళ్లడం చూశామని మిగతా విద్యార్థులు పోలీసులకు చెప్పడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫూటేజిలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని మరింత క్షుణ్ణంగా విచారణ జరిపారు. నిందితుడిని శనివారం కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ దారుణంపై విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌ ముందు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనీ.. స్కూల్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన నేపథ్యంలో పాఠశాఖ వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

——————