కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి

*బిల్డింగ్ పెయింటింగ్ కార్యవర్గం ఎన్నిక
మిర్యాలగూడ. జనం సాక్షి.
కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి కోరారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్ సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మంద రాజు, ఉపాధ్యక్షులుగా నాగులు మీరాను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారిని సన్మానించి మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అందించాలని కోరారు. కార్మికులు ఐక్యంగా ఉండి బలమైన పోరాటాలు చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని, హక్కులను సాధించుకోవాలని కోరారు. కార్మికులు భేదాభిప్రాయాలు మానుకొని సంఘం బలోపేతంకు పాటుపడాలని కోరారు. పూర్తిస్థాయి కార్యవర్గాన్ని త్వరలో  ఎన్నుకోనున్నట్టు తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు బాధ్యతగా పనిచేసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బిఎం నాయుడు, పెయింటింగ్ కార్మికులు ఎండి నజీర్ వాస శివకృష్ణ, మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, కోటి, సురేందర్, అన్వర్, గంగరాజు, కనకయ్య, సుధాకర్, నాగరాజు, వెంకన్న, జానీ, కొటేష్ తదితరులు పాల్గొన్నారు.