కాల్పుల్లో ఎంఐటీ భద్రతాసిబ్బంది అధికారి మృతి

బోస్టన్‌: మస్సాచు సెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐజీ)కి చెందిన ఓ భద్రతా సిబ్బందిని దుండగులు కాల్చి చంపారు. అనంతరం క్యాంపన్‌ పరిసరాల్లో కాల్పులు, పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం. బోస్టన్‌ మారథాన్‌ జంట పేలుళ్లు చోటుచేసుకున్న రెండు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.