కాల్‌మనీ కేసులో చర్య తీసుకోండి

ట్వీట్‌లో డిజిపికి కేశినేని నాని వినతి
విజయవాడ,జూలై22(జ‌నంసాక్షి):   కాల్‌ మనీ మాఫీయా వల్ల ప్రజలు పడే ఇబ్బందులు ఈ రాష్ట్రంలో అందరి కంటే ఎక్కువ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కే తెలుసని విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని నాని అన్నారు. కాల్‌ మనీ మాఫియా బారిన ప్రజలు పడకుండా కాపాడాలని ఆయన కోరారు. ఈమేరక ఆయన ట్వీట్‌ చేశారు. కాల్‌ మనీ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాన్ని ట్వీట్‌కు కేశినేని నాని అటాచ్‌ చేశారు.  ఓ టీడీపీ నాయకుడిని టార్గెట్‌ చేసుకుని ట్వీట్లతో సోషల్‌ విూడియాలో తీవ్ర దుమారం లేపుతున్న నాని కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించిన సమస్యను డీజేపీ దృష్టికి తీసుకెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ టీడీపీ నేత గతంలో కాల్‌మనీ కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయణ్ని టార్గెట్‌ చేసుకునే ఈ ట్వీట్‌ చేసినట్టు భావిస్తున్నారు.