కాశిబుగ్గ దసరా ఉత్సవ పనులు ప్రారంభం..

-హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 25(జనం సాక్షి)
కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి నిర్వహిస్తున్న రావణసురవద,దసరా ఉత్సవముల ఏర్పాట్ల పనులను వడ్డెపల్లి చెరువు వద్ద ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు..ఉత్సవ ప్రాంగణాన్ని పరిశీలించి పనులు వేగంగా చేపట్టవలసిందిగా అదికారులను ఆదేశించారు..ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా,సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు..ఈ పనులను కార్పోరేటర్ గుండేటి నరేంద్రకుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తూ కో ఆర్డినేట్ చేశ్తారని ఆయన అన్నారు..
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటి అద్యక్షులు ధూపం సంపత్, కన్వీనర్ బయ్య స్వామి,ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్,గుండేటి నరేంద్రకుమార్,తూర్పాటి సారయ్య,గుల్లపెల్లి రాజ్ కుమార్,గోరంటాల మనోహర్,గుత్తికొండ నవీన్,ఓంప్రకాష్,కొలరియా,సిద్దోజు శ్రీనివాస్,సిలువేరు థామస్,వేముల నాగరాజు,బాకం హరిశంకర్,గుర్రపు సత్యనారాయణ,మార్టిన్ లూథర్,రామా యాదగిరి,వలపదాసు గోపి,ములుక సురేష్,క్యాతం రవిందర్,రంజిత్,బాల మోహన్,నూకల రాణి,పెండ్యాల సోను,చింతం రాజు,చిమ్మని సంతోష్,దుబ్బ శ్రీను,కోట సతీష్,మోతీలాల్ నాయక్,తదితరులు పాల్గొన్నారు
Attachments area