కిర్గిజిస్తాన్‌ పర్యటన జయప్రదం

4

ప్రధాని నరేంద్ర మోదీ

హైదరాబాద్‌ 12 జూలై

(జనంసాక్షి)

మధ్య ఆసియా దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కిర్గిజిస్థాన్‌లో పర్యటించారు. కిర్గిజిస్థాన్‌ అధ్యక్షుడితో బ’ాటీ అనంతరం ప్రధాని మోదీ మీడి యాతో మాట్లాడుతూ…. కిర్గిజిస్థాన్‌ అధ్యక్షు డితో చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలి పారు. శాంతియుత ఇరుగుపొరుగును కో రుటున్నామని తెలిపారు. కిర్గిజిస్థాన్‌తో రక్షణ సంబంధాలు బలంగా ఉన్నాయ న్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పర్యా టక, మానవవనరులు సహా ఇతర రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించినట్లు చెప్పా రు. ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరా డాలని, ఏటా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.