కిలా వరంగల్ తాసిల్దార్ కార్యాలయం రిగ్బంధించిన వీఆర్ఏలు

వరంగల్ ఈస్ట్ ,అక్టోబర్ 10(జనం సాక్షి)

నిండు అసెంబ్లీ లో తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకులకి ప్రకటించిన పే స్కేల్, 55 సం. నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు, అర్హత కల్గిన వీఆర్ఏ లకు ప్రమోషన్ కల్పించాలి అని రాష్ట్ వీఆర్ఏ జాక్ ఇచ్చిన పిలుపు మేరకు నిరవధిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో భాగంగా ఖిలా వరంగల్ మండలంలోని వీఆర్ఏ లు మండల అధ్యక్షులు శ్రీ అన్నం సదానందం గారి అధ్యక్షతన 78వ రోజు సమ్మెలో తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధించి నిరసన తెలిపి తమ యొక్క ప్రధానమైన డిమాండ్స్ తక్షణం పరిష్కరించి న్యాయం చేయాలని కోరినారు. ఈ కార్యక్రమం లో వరంగల్ జిల్లా వీఆర్ఏ జాక్ కో -కన్వీనర్ & మండల గౌరవ అధ్యక్షులు గుండాల వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు ఆరూరి క్రిష్ణకాంత్, కార్యదర్శి మేకల యాదగిరి, కోశాధికారి చిట్ల విశ్వేశ్వర్ మరియు వీఆర్ఏ లు సూర్య, విద్యా సాగర్, ఎకాంబ్రం,రమేష్, ప్రమీల, దర్శనం, గణేష్, ఆసిఫ్, రాములు, సారయ్య, కుమారస్వామి, శేకర్, గోపరాజు రాజు, ఎల్లయ్య, సూరయ్య, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.