కుల్గాం ఎన్ కౌంటర్లో లష్కరే చీఫ్ హతం

gwcn6kprశ్రీనగర్ : లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ ఖాసిమ్ హతమయ్యాడు. ఉద్దంపూర్ దాడికి ఖాసిమ్ ప్రధాన సూత్రధారి. ఖుల్గామ్ జిల్లాలో ఉగ్రవాది ఖాసిమ్ ఎన్‌కౌంటర్ జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది ఖాసిమ్ గత ఆగస్టు 5న ఉద్దంపూర్ బీఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై దాడికి ప్రణాళిక వేశాడు. ఆ దాడిలో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. ఇటీవల కశ్మీర్‌లో జరుగుతున్న ప్రధాన దాడుల్లో ఖాసిమ్ పాత్ర ఎక్కువగా ఉంది. 2013లో హైదర్‌పోరా ఆర్మీ కాన్వాయ్‌పై కూడా ఖాసిమ్ దాడి చేశాడు. ఎన్‌కౌంటర్ స్పెష్టలిస్ట్ ఆఫీసర్ అల్తాఫ్ అహ్మాద్‌ను చంపిన కేసులో ఖాసిమ్ ప్రధాన నిందితుడు. అతనిపై 20 లక్షల నగదు నజరానా కూడా ఉంది