కూకట్‌పల్లిలో దోపిడీ దొంగల బీభత్సం

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ మూడో ఫేజ్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ కాళ్లు, చేతులు కట్టి గొంతుకోసి దుండగులు పరారైనట్లు సమాచారం. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.