కూతురుని నాలుగంతస్తుల భవనం మీది నుంచి కిందికి విసిరేసి…
ఆదివారం మధ్యాహ్నం భర్త ఇంట్లో లేని సమయంలో స్వాతి తన కుమార్తెను నాలుగంతస్తుల భవనం టెర్రస్ మీదికి తీసుకెళ్లి కిందికి విసిరేసింది. గబగబా కిందికి దిగివచ్చి రక్తమోడుతున్న పాపను మళ్లీ భవనం మీదికి తీసుకెళ్లింది. ఏంజరిగిందంటూ స్థానికులు ప్రశ్నించినప్పటికీ… ‘నా కూతురు.. నా యిష్టం… మీరెవరు నన్ను అడగడానికి… మీపని మీరు చూసుకొండి…’ అంటూ మళ్లీ టెర్రస్ మీది నుంచి కిందికి విసిరేసింది. దీంతో శ్రేయ అక్కడికక్కడే మరణించింది. కూతురిని చంపేసి పారిపోతున్న ఆమెను స్థానికులు తాళ్లతో బంధించి కరెంటు స్తంభానికి కట్టేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను విడిపించి అరెస్టు చేశారు. కాగా ఆమెను మానసిక రోగిగా భావిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. స్వాతి భర్త కాంచన్ కుమార్ మాట్లాడుతూ.. తమ కుమార్తెకు సరిగా మాటలు రాకపోవడంతో స్వాతి తరచూ కోపపడేదని పేర్కొన్నారు. ఇటీవల కొద్దికొద్దిగా మాటలు వస్తున్నప్పటికీ ఆమె కోపం తగ్గలేదని… పాపను మరింత వేధించడం మొదలు పెట్టిందని చెప్పారు.