కూతురుని నాలుగంతస్తుల భవనం మీది నుంచి కిందికి విసిరేసి…

  బెంగళూరు: కన్నతల్లే ఆ చిన్నారి పాలిట మృత్యుపాశమై వెంటాడింది.. అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న బిడ్డను అత్యంత దారుణంగా పొట్టనబెట్టుకుంది… సరిగా మాట్లాడడం లేదంటూ చిన్నారిని నాలుగు అంతస్తుల భవనం నుంచి రెండు సార్లు కిందికి విసిరిన వైనం స్థానికులను కలవరపాటుకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని జేపీ నగర్‌లో స్వాతి సర్కార్, కాంచన్ సర్కార్ దంపతులకు శ్రేయ అనే ఏడేళ్ల కుమార్తె ఉంది. స్వాతి గతంలో స్కూల్ టీచర్‌గా పనిచేయగా.. కాంచన్ ప్రస్తుతం ఓ ప్రముఖ కంపెనీలో సీనియర్ బిజినెస్ ఎనలిస్టుగా పనిచేస్తున్నారు.