కృష్ణా జలాల వివాదం కేసు అక్టోబరు 15కు వాయిదా

ఢిల్లీ : కృష్ణా జలాల వివాదం కేసును సుప్రీంకోర్టు అక్టోబరు 15కు వాయిదా వేసింది. అదే రోజు తుది విచారణ చేపడతామని జస్టిస్‌ ప్రపుల్‌ సి. పంత్‌, దీపక్‌మిశ్రాతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ట్రిబ్యునల్‌, విభజనచట్టంలోని సెక్షన్‌ 89 పరిధిని తుది విచారణలో తేలుస్తామని సుప్రీం స్పష్టం చేసింది. నీటి పంపకాలు నాలుగు రాష్ర్టాల మధ్య జరగాలా ? లేక ఏపీ, తెలంగాణలకే పరిమితం చేయాలా ? అన్న విషయంపై తేల్చాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.