కెసిఆర్‌ కలల ప్రాజెక్ట్‌ డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు

కొత్తగూడెం,నవంబర్‌21 (జనం సాక్షి)  : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏదైతే కలలు కన్నారో ఆదిశగా పేదోని సొంతింటి కలను నెరవేరుస్తూ అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు అందేలా ప్రభుత్వం చూస్తుందని జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య అన్నారు. త్వరలోనే పలు ప్రాంతాల్లో గృహప్రవేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుతున్నాయన్నారు. అర్హత కలిగిన ప్రతీ నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం. అందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా సా¬సోపేతమైన నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూ మేరకు పైసా ఖర్చు లేకుండా సర్కార్‌ స్థలంలోనే అన్ని రకాల వసతులతో రెండు పడకల ఇంటిని నిర్మించి ఇచ్చేందుకు నిర్మాణాలను సిద్ధం చేశారు. నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా నిర్మాణాలు గుత్తేదారు చేపడతున్నారు.