గ్రామ పంచాయతీల సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు

తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 25, (జనంసాక్షి) :నేతాపురం హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛత హీ సేవా-2024 కార్యక్రమం లో భాగంగా మండలంలోని నేతాపురం , మెగ్య తండ, శీతల తండ, ధన్సింగ్ తండ, గట్టుమీది తండ గ్రామ పంచాయతీల సిబ్బందికి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలిపారు . పరీక్షల అనంతరం మందుల పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్ పి ఆర్ మౌనిక, ఏఎన్ఎం కే సరిత, ఆశ కార్యకర్తలు ఆర్ పద్మ , యం స్వప్న పాల్గొన్నారు.