కెసిఆర్‌ మరోమారు సిఎం కావాలి

బంగారు తెలంగాణ కల సాకారం అవుతుంది: ఎంపి

ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలవనుందని, కెసిఆర్‌ దక్షతే ఇందుకు నిదర్శనమని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్దికి ప్రపంచ దేశాలు స్పందిస్తున్న తీరే ఇందుకు కారణమన్నారు. సులువుగా వ్యాపారాన్ని నిర్వహించుకోవడంలో తెలంగానలో అనుకూల వాతావరణం ఉండడంతో పాటు, ముందంజలో ఉండడం గర్వకారణమని అన్నారు. సులభతర వాణిజ్యంలో తెలంగాణకు ప్రథమ స్థానం దక్కడం సామాన్య విషయం కాదన్నారు. గత నాలుగేళ్ల పాలనో

ఇవన్‌ఈన సాధ్యమయ్యాయని అన్నారు. అలాగే మరోమారు టిఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించేలా ఆదరించాలన్నారు. అప్పుడే బంగారు తెలంగాణకు బాట పడుతుందన్నారు. సంక్షేమం,అభివృద్ది మేళవించి పాలన సాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ దూరదృష్టి, పరిశ్రమలశాఖ మంత్రి కెటిఆర్‌ పట్టుదలతో సులభ వాణిజ్య విధానంలో తెలంగాణకు దేశంలోనే నంబర్‌ వన్‌ ర్యాంకు లభించిందని అన్నారు. రాష్ట్ర అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలంటే కేసీఆర్‌ మరోమారు సిఎం కావాల్సి ఉందని ఆకాంక్షించారు. స్వరాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడానికి సీఎం కేసీఆర్‌ నిరంతరం శ్రమిస్తున్నారని, బంగారు తెలంగాణ దిశగా దూసుకుపోతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ఇలా ఎన్నో ప్రజామోద పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారని చెప్పారు.