కెసిఆర్ నియంత పాలనకు చమరగీతం పాడుదాం- కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్

భువనగిరి, జనంసాక్షి, ఆర్.సీ న్యూస్ ;భువనగిరి పట్టణ కేంద్రంలోని 23వ వార్డులో రెడ్డివాడ, పోచమ్మవాడలో భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెయ్యి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈసందర్భంగా కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థి యువకుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ కుటుంబం చేతిలో బందీగా మారిపోయిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల అని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్లు ఎక్కడ రాలేదు. నిధులు రాలేదు. నియామకాలు చేయలేదు. గత 9 సంవత్సరాల కెసిఆర్ ప్రభుత్వ పరిపాలనతో పేద దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలు విసుకు చెందారని ప్రజలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుద్దామని ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ కీ ఓటు వేస్తామని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శ్రీమతి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను వెంటనే అమలుపరచి పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందాని ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెయ్యి గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈకార్యక్రమంలో గాయపాక స్వామి, కారకాల పోచయ్య, బర్రె యాదగిరి, తోట మహేందర్, నువ్వుల రాజు, నాగరాజు, బాబు,బర్రె నరేందర్ రాము మోహన్, మహేష్, సాయి, మల్లేష్, ప్రభాకర్, ఈశ్వర్, ఓంకార్, కిరణ్, తరుణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.