కేంద్ర సాయం కోరనున్న తమిళనాడు

చెన్నై : తమిళనాడులో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రూ. 19,665 కోట్లను సాయంగా ఇవ్వాలని కేంద్రాన్ని తమిళనాడు సర్కార్‌ కోరనుంది. తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడుతూ కరవు కోరల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రూ.19,665కోట్లను సాయంగా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నట్టు ఆమె తెలిపారు.