కేబినెట్లలో మహిళలకు స్థానాలు కల్పించాలని డికె అరుణ పిటిషన్…తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 7 : తెలంగాణ సహా ఏడు రాష్ర్టాల మంత్రివర్గాల్లో మహిళలకు స్థానం కల్పించాలంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డి.కే అరుణ్ సుప్రీం కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది. మహిళలకు స్థానం కల్పించి ఉంటే బాగుండని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.