కేరళలో ప్రచార కార్యక్రమాలు రద్దు చేసుకున్న అమిత్ షా
కొల్లాం: కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్దేవి ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 102 మంది మృతిచెందగా.. దాదాపు 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేరళలో ప్రచార కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్లు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. పుట్టింగల్ ఆలయాన్ని అమిత్ షా సందర్శించనున్నారు.