*కేసీఆర్ క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే**

*వికలాంగులకు వీల్ చైర్ లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే*
*మున్సిపల్  చైర్మన్ బి ఎస్ కేశవ్ ఆధ్వర్యంలో  ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు* *
 గద్వాల ,ఆర్ సి .సెప్టెంబర్ 21,  (జనం సాక్షి).
గద్వాల జిల్లా కేంద్రంలోని  వైఎస్సార్ సర్కిల్ సమీపంలో ఎమ్యెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీద కేసీఆర్ రూ5 క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంటీన్ లో భోజనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన నుండి వచ్చే ప్రజలకు ఈ బోజనం ఎంతో ఆసరాగా ఉంటుందని బీద మధ్య ప్రజలనుద్దేశించి ఈ పథకాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ప్రజలు కేసీఆర్ క్యాంటీన్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే క్రిష్ణ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా  కార్యకర్తలు అభిమానులు నాయకులు తదితరులు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Attachments area