కొండమల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం

కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ :
శ్రీమతి స్వర్గీయ ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కొండమల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి మండల కేంద్రం లో అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రీమతి ఇందిర గాంధీ గారి చిత్రపటానికి కొండమల్లేపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు డాక్టర్ వేమన్ రెడ్డి ,వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులర్పించి,పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతరత్న, భారత మహిళా తొలి ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ భారత్ లో ఎన్నో సంస్కరణలు చేశారని కొనియాడారు, భారత అభివృద్ధికి ఎన్నో సాహసోపేతం నిర్ణయాలు తీసుకుంటూ, బ్యాంకులను జాతీయం చేశారు అన్నారు సంపన్నమైన కుటుంబంలో జన్మించినప్పటికీ ఆమె సాధారణమైన జీవితం గడిపారు అంతర్జాతీయ విద్యాసంస్థలలో ఉత్తమ డాక్టరేట్లు, డిగ్రీలు పొందారు ఇందిరాగాంధీ దేశానికి చేసిన విశిష్ట సేవలను కొనియాడారు ప్రతి భారతీయుడు గుండెల్లో ఇందిరా గాంధీ కొలువై ఉన్నారు అన్నారు ఆమె ఆశయాలను కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బక్కులు, మంగ్య నాయక్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ కుమార్ యేకుల,కార్తీక్, రాజేందర్ రెడ్డి, NSUI తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఖదీర్ ,సేవ నాయక్ ,నాగేంద్ర,రాజు నాయక్, శ్రీకాంత్,జర్పుల శంకర్, తదితరులు పాల్గొన్నారు.